కామారెడ్డి, జనవరి 31: ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక సాయంతోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్టు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన బానోతు వెన్నెల తెలిపారు. మంగళవారం ఆమె కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. 5,895 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న అధిరోహించి, జాతీయ పతాకంతోపాటు సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్కుమార్ ఫ్లెక్సీని ప్రదర్శించినట్టు తెలిపింది.
ఏడాది క్రితమే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశం వచ్చినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయినట్టు ఆమె పేర్కొంది. తిరిగి ఆ సారి కూడా అవకాశం వచ్చిందని, అయితే ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక సాయం చేయడంతో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్టు వివరించింది. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని వెల్లడించింది.