హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హరిత నిధిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించడంపై గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు సహకరించాలని కోరడంపై వారు స్పందిస్తూ.. ప్రకృతి ప్రేమికులుగా గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల రూ.5వేల విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్లో వేర్వేరుగా వెల్లడించారు.