MP Santhosh | అడవులు, పర్యావరణ సంరక్షణకు తన మద్దతు ఉంటుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. పర్యావరణం, అడవులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సంతోష్ ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్లైఫ్ శాంక్చువరీలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ జయోతి బెనర్జీ, తిప్పేశ్వర్ డీఎఫ్ఓ కిరణ్ జగ్తప్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వెంట అటవీ రక్షణ, పులుల సంచారంపై చర్చించారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తివంతమైన పనులను ఎంపీ వివరించారు. అందమైన అడవులు, వన్యప్రాణులను చూసేందుకు త్వరలోనే మరోసారి వస్తానని ఎంపీ తెలిపారు. ఈ విశేషాలను మహారాష్ట్ర అటవీ అధికారి మ్యాజికల్ మెల్ఘాట్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తిప్పేశ్వర్ శాంక్చువరీలో ఎంపీ సంతోష్ కుమార్ తీసిన జంతువులు, పక్షుల ఫొటోలను కూడా ట్విట్టర్లో జతచేశారు. ఎంపీ సంతోష్ గత కొన్నేండ్లుగా వీలున్నప్పుడల్లా వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ, తన కెమెరా ద్వారా ప్రకృతి, పక్షులు, వన్యప్రాణుల చిత్రాలను తీస్తూ.. ప్రతి ఆదివారం ‘వీక్లీ డోస్ ఆఫ్ మై ఫొటోగ్రఫీ’ శీర్షికతో ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
https://t.co/fRrjqNJidM RajyaSabha Telengana, Shri @SantoshKumarBRS visited #TipeshwarWildlifeSanctuary recently
During Safari he saw the wilderness of Tipeshwar & captured it on camera
Sharing a few photos clicked by him#MelghatTigerReserve looks forward to hosting him again pic.twitter.com/QGe90ksZqA— Magical Melghat (@magical_melghat) April 21, 2023