పరిగి, జనవరి 7: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సతీమణి సీతా రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతిఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ చేపట్టి పచ్చదనం పెంపునకు సహకరించాలని కోరారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప లక్ష్యంతో కూడుకున్నదని వారు ప్రశంసించారు.