హైదరాబాద్, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన కోసం ప్రతిపక్షాలన్నీ ఒకటై కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య కోరారు. కులగణన చేపట్టాలని గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద బీసీ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించారు.
ఈ విషయంపై పార్లమెంటులో విస్తృతంగా చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే సమావేశాలను బహిషరించాల ని పిలుపుని చ్చారు. కులగణనతో కులా ల జనాభా ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయని, వారి జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. దశాబ్దాలుగా బీసీ కులాలకు జరుగుతున్న అన్యా యాన్ని ఇక సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మారేశ్, మహేందర్, కర్రి వేణుమాధవ్, నీలా వెంకటేశ్, అనంతయ్య, అంగిరేకుల వరప్రసాద్, రామకృష్ణ, పృథ్వీగౌడ్, పద్మలత పాల్గొన్నారు.