హైదరాబాద్: తెలుగు మహా సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ బాలాదిత్యపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరో తెలవని వాళ్లు యాంకర్ అవుతారా అంటూ మండిపడ్డారు. తెలుగు మహాసభలు పెట్టిన వారికి బుద్ధి లేదా, అసలు ఆ సభలు పెట్టింది ఎవరంటూ ఫైరయ్యారు. ఎంపీగా ఉన్న నేనే పేపర్లలో రాసుకుని చదువుతున్నా.. ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఏ సీఎం వస్తున్నడో తెలియకుండా యాంకర్ చదువుతడా అని విమర్శించారు. ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనుక ఎదో కుట్ర ఉందన్నారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఎదో కుట్ర ఉంది
ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టింది
తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా.. ముఖ్యమంత్రే తెలవని వాళ్లు… https://t.co/RkiGIqmwcG pic.twitter.com/d3fpP0INws
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
హైదరాబాద్ హైటెక్స్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హోస్ట్గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య ఆహ్వానించారు. అప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్కుమార్ గారు అంటూ ఉచ్ఛరించాడు. యాంకర్ నోటి నుంచి సీఎం కిరణ్కుమార్ అని రావడంతో సభ కింద ఉన్నవారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో తాను చేసిన తప్పును యాంకర్ గ్రహించాడు. ఆ వెంటనే తన తల పట్టుకుని స్టేజిపై నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి తన క్షమాపణలు చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉచ్ఛరించాడు.
మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం
త్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025