హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ (Alai Balai). రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పండుగ. ప్రతి ఏటా దసరా (Dassera) మరుసటి రోజు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో (Exhibition Grounds) జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు (K.Keshava rao), కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మీనాక్షీ లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి, కంభంపాటి హరిబాబు, రాధా కృష్ణన్, వీ.హనుమంతరావు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారందరిని దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.