హైదరాబాద్ : జనగామ మున్సిపల్ (Muncipal elections)చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఆపాలంటూ అధికారులతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాగ్వివాదానికి దిగాడు. బీఆర్ఎస్ కౌన్సిలర్ హాఫిజ్ ఫాతిమా హాజరైనా మిస్సింగ్ కేసు నమోదైందంటూ చామల వితండవాదం చేశారు. కోరం సభ్యులు అందరూ హాజరైనందుకు ఎన్నిక ఆపడం కుదరదంటూ చామలకు అధికారులు తేల్చిచెప్పారు.
కాగా, 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫిజ్ ఫాతిమాపై మిస్సింగ్ కంప్లైంట్ నమోదైందని, ఎన్నిక వారం రోజులు వాయిదా వేయాలంటూ పొడియం ముందుకు వెళ్లి ప్రొసీడింగ్ అధికారితో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమంటూ ప్రొసీడింగ్ అధికారులు స్పష్టం చేశారు.