హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఎన్నికల రోజు కూడా బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం బుద్ధభవన్లో సీఈవోను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం బడుగుల మాట్లాడుతూ.. నాంపల్లి మండలం మహ్మదాపురం, మర్రిగూడెం మండలం రాంరెడ్డిపల్లె, చౌటుప్పల్ పట్టణంతోపాటు చాలా ప్రాంతాల్లో బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసిందని తెలిపారు. దీన్ని వెంటనే ఆపించాలని కోరారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చెప్పారు. వందల కార్లలో బీజేపీ గుండాలను మునుగోడుకు తరలించిందని ఆరోపించారు. మునుగోడు గెలుపుతో బీఆర్ఎస్కు నాంది పలుకుతామని చెప్పారు.