హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యా హ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మోత్కుపల్లి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. తర్వాత బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుంటారు. సీఎం సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు.