జమ్మికుంట, డిసెంబర్ 9: మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ అన్నట్టే జరుగుతున్నది. నానాటికి మానవత్వం కానరాకుండా పోతున్నది. అందుకు గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఉదంతమే నిదర్శనం. వివరాల్లోకెళ్తే.. వీణవంక మం డలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా రిటైర్మెంట్ తరువాత మరణించారు. కొన్నేండ్లుగా తల్లికి పింఛన్ వస్తున్నది. వీరికి జమ్మికుంటలో రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. ఒక పోర్షన్ కూతురికి పసుపు కుం కుమ కింద ఇవ్వగా, మరో పోర్షన్లో తల్లి ఉం టున్నది. నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఘన్ముక్లలో ఉంటుండగా, చిన్న కొడుకు జమ్మికుంటలో వ్యాపారిగా స్థిరపడ్డాడు. తల్లి అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా చిన్న కొడుకు దగ్గరే ఉంటున్నది. కొద్దికాలం క్రితం తల్లి పేరిట ఉన్న ఇల్లు చిన్న కొడుకుకు రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది. అయితే తల్లి బుధవారం మరణించింది. విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులంతా చేరుకున్నారు. ఆస్తుల కోసమో.. ఆర్థిక లావాదేవీల కోసమో.. తెలియదు కానీ, ఇంటిముందు తల్లి మృతదేహాన్ని పెట్టుకొని కొడుకులు గొడవకు దిగారు. కుల పెద్దలు వచ్చి నచ్చజెప్పాలని చూసినా విన్పించుకోలేదు. రోడ్డు మీద గొడవ పెద్దది కావడంతో 100 నంబర్కు ఫోన్వెళ్లింది. ఎస్సై సతీశ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. తల్లి అంత్యక్రియలు ముందుగా చేయాలని సూచించారు. ఆస్తులు, ఆర్థిక లావాదేవీలుంటే తర్వాత మాట్లాడుకోవాలని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ వెంటనే తల్లిదండ్రుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై ముగ్గురు అన్నలు, తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. తల్లి మృతదేహాన్ని ఇంటి ముందు పెట్టుకొని గొడవకు దిగిన కొడుకుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.