ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు మంగళవారం శాంతినగర్కు చెందిన షాకేర సుల్తాన (30) గర్భిణి కుటుంబ సభ్యులు డెలివరీ కోసం తీసుకువచ్చారు. అయితే డెలివరీ అయితన తర్వాత పుట్టిన బాబు చనిపోయాడని, బాలింత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఆ తర్వాత సుల్తానా సైతం మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీ బిడ్డలు ఇద్దరు మృతి చెందారని.. శిశువు, తల్లి, మృతి చెందినా చెప్పలేదని చెప్పలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని శాంతింప జేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.