సుల్తాన్బజార్,జూన్ 29 : ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిన లక్ష రూపాయల నగదును తిరిగి అప్పగించి ఎంజీబీఎస్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ సుధ తన నిజాయితీని చాటుకొన్నారు. వివరాళ్లోకెళ్లితే.. హనుమకొండకు చెందిన షాకత్ అలీ ఈ నెల 28న రాత్రి హనుమకొండలో ఆర్టీసీ బస్సెక్కి ఉప్పల్లో దిగాడు. తర్వాత తన జేబులో రూ.లక్ష నగదు కనిపించలేదు. దాంతో కంగారుపడ్డ షౌకత్ అలీ వెంటనే ఎంజీబీఎస్ అసిస్టెంట్ మేనేజర్ సుధకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఆ బస్సు ఎంజీబీఎస్ నుంచి తిరిగి హనుమకొండకు బయలుదేరింది. టికెట్ ఆధారంగా హనుమకొండ డిపో మేనేజర్కు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాచారం అందిన వెంటనే డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి చూడగా రూ.లక్ష నగదు కనిపించింది. షౌకత్ అలీకి ఆ నగదు ఇవ్వాలని హనుమకొండ డిపో మేనేజర్కు ఆమె తెలిపింది. లక్ష నగదు ఇప్పించిన అసిస్టెంట్ మేనేజర్ సుధకు, అధికారులకు, సిబ్బందికి షౌకత్ అలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.