హైదరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత 11 రోజుల కిందట నాలాలో కొట్టుకుపోయిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి మృతదేహం ఐడీపీఎల్ కాలనీ నాలాలో లభ్యమైంది. వర్షానికి ప్రమాదవశాత్తు మోహన్రెడ్డి నాలాలో పడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోహన్రెడ్డి మృతదేహం కోసం జీహెచ్ఎంసీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు మంగళవారం మృతదేహం లభించడంతో పోస్ట్మార్టం నిర్వహించి బాధిత కుటుంబానికి అందజేయనున్నారు. కాగా, నాలా క్యాపింగ్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.