హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రం లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నాలుగుచోట్ల జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. 8న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, వరంగల్, 10న మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 9న వికారాబాద్లో, 11న భువనగిరి సభల్లో పాల్గొననున్నారు.