హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంటు లోపల, బయట ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సమకాలీన పరిస్థితులపై కేసీఆర్కు ఉన్న అవగాహన, లోతైన ఆలోచనలు, వ్యూహరచన, దార్శనికతను గుర్తించి దేశం నలుమూలల నుంచి అనేక పార్టీల అధ్యక్షులు, ప్రజలు ఆయనకు మద్దతిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ బేగంపేట విమానాశ్రయం వద్ద పట్టపగలే కలలు కన్నారని, అవి ఎప్పటికీ నెరవేరవని తేల్చి చెప్పారు. తెలంగాణలోనే కాదు.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఘోరంగా ఓడిపోవటం ఖాయమని పేర్కొన్నారు.