హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేవిధంగా మోదీ ప్ర భుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దుర్నీతిని మానుకోకపోతే తీవ్రస్థాయిలో ప్ర జాపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో ఓటమిని జీర్ణించుకోలేక ఐటీ, ఎన్నికల కమిషన్, గవర్నర్ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.
ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనులు ఎఫ్బీఆర్ఎం పేరుతో తెలంగాణపై ఆంక్షలు పెడుతూ ఆర్థిక దిగ్భంధనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు వివిధ రూ పాల్లో రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల నిధులకు మోకాలడ్డుతూ ఆర్థిక దా డికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్రల పేరుతో బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.