COVID-19 Vaccine | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్తూనే మరోవైపు ‘రాష్ర్టాలకు కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయం. సొంతంగా మీరే కొనుక్కోండి’ అంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెగేసి చెప్పారు. రాష్ట్రాలు ఎంతగా విన్నవించినా పట్టించుకోకుండా బహిరంగ మారెట్లో వ్యాక్సిన్లు పుషలంగా ఉన్నాయి’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ప్రజారోగ్యంపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్థమవుతున్నది. కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై వివిధ రాష్ట్రాల మంత్రులు, కేంద్రపాలిత ప్రాంత అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5 అంచెల వ్యూహాన్ని పకాగా అమలు చేయాలని కోరారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. ముందు జాగ్రత్త డోసుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నదని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవటంతో నిల్వలు లేకుండా పోయాయని, దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని వివరించారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని కోరారు. ఇదే విషయమై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ఇక తెలంగాణతోపాటు సమావేశంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్టు కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ మన్సుఖ్ మాండవీయ మాత్రం నిర్లక్ష్యంగానే సమాధానమిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నాయంటూనే వ్యాక్సిన్ సరఫరా చేసేది లేదంటూ తెగేసి చెప్పారు. కేంద్రం నిర్లక్ష్యంపై రాష్ర్టాలు మండిపడుతున్నాయి.
తెలంగాణ సాధించిన విజయాలను అభినందిద్దాం
ప్రజారోగ్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అద్భుత విజయాలను ప్రపంచఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందిద్దామని ప్రజలకు ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ప్రసూతి మరణాల సంఖ్య 81 నుంచి 43కు, శిశుమరణాల రేటు 35 నుంచి 21కి తగ్గిందని, కేసీఆర్కిట్ ప్రారంభంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 65 శాతానికి పెరిగిందని, ఆరోగ్యశ్రీ సేవలు 30 నుంచి 55 శాతానికి పెరిగాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రగతి నివేదికను ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
సొంతంగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని నిర్ణయం
కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసే విషయంలో కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని నిర్ణయించింది. వ్యాక్సి న్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ ఎండీ మహిమా దాట్లకు మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.