హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవనంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా నీరు నిలువకుండా క్షణాల్లో వెళ్లిపోయేలా రోడ్లు భవనాలశాఖ ఆధునిక డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నది. డ్రెయిన్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఏసీవో డ్రెయిన్స్కు కాంట్రాక్ట్ అప్పగించారు.
భవనం బయట కెర్బ్ డ్రెయిన్స్ ఏర్పాటుచేస్తారు. రోడ్లు మధ్యలో ఉండే డివైడర్కు, ప్రాంగణం చివర, మధ్యలో ఉండే లాన్ నుంచి బయటకు వెళ్లేలా ఇవి ఉంటాయి. కారిడార్లలో యూరో లైన్ బ్రిక్స్లాట్ పద్ధతిలో మల్టిలైన్ డ్రెయిన్లను ఏర్పాటుచేస్తారు.