హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జూలై నాలుగో తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు ఉన్న తూర్పు పడమర ద్రోణి తె లంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో 24 జిల్లాల్లో పలుచోట్ల వాన పడినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.