న్యూఢిల్లీ: కోవిడ్ కలవరం మళ్లీ మొదలైన నేపథ్యంలో.. ఇవాళ దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లు అన్నీ ప్రిపేరవుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. నగరంలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో మంత్రి మాండవీయ పరిశీలించారు. ఇలాంటి డ్రిల్ చేపట్టడం వల్ల మనం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నామో తెలుస్తుందని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే వీలవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు.
Telangana | Mock drill, to check covid preparedness, being conducted at Gandhi Hospital in Hyderabad.
We are checking our preparedness, if at all, covid cases increase in the state: Supt Raja Rao pic.twitter.com/9n8fzREbk7
— ANI (@ANI) December 27, 2022
హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లోనూ ఇవాళ కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లు పెరిగితే అప్పుడు ఎలాంటి చికిత్సను అందించాలో హాస్పిటల్ సిబ్బంది సిద్ధం చేశారు. ఎంత వరకు ప్రిపేరై ఉన్నామో చెక్ చేసుకుంటున్నామని గాంధీ హాస్పిటల్ ఆఫీసర్ తెలిపారు. డ్రిల్లో భాగంగా కీలకమైన ఆరోగ్య సౌకర్యాల గురించి పరిశీలించనున్నారు. ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోనున్నారు.