Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పది విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను( Hall Tickets ) ఈ నెల 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లు పంపుతామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరువుతున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో డీఈవోలు,ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు పాల్గొన్నారు.