హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao)ను డెక్సార్ మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధులు నేడు మంత్రుల నివాసంలో కలిశారు. మల్టీ గిగాబిట్ పాయింట్ టు మల్టీ పాయింట్ డాటా ట్రాన్స్పోర్ట్ (Data Transport)లో, సెన్సారింగ్ సిస్టమ్స్ లో తమ కంపెనీ ఎక్స్పర్ట్ అని ఈ సందర్భంగా వారు మంత్రికి తెలియజేశారు.
ఈ రెండు రకాల సాఫ్ట్ వేర్ని తాము అందిస్తామని..ఇందుకు తమకు అవకాశం ఇవ్వాలని మంత్రిని డెక్సార్ ప్రతినిధులు కోరారు. సమయం ఇస్తే, ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తామని మంత్రికి తెలియజేశారు . దీనిపై మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ..పవర్పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత సీఎం కేసీఆర్ (CMKCR), ఐటీ మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లి ఆలోచిస్తామని చెప్పారు.
మంత్రి దయాకర్ రావుని కలిసిన వారిలో డెక్సార్ సిఇఓ డాక్టర్ డిమిట్రీ కాచన్, ప్రొఫెసర్ ఎడ్వార్డ్ సిమెన్స్, ఇతర ప్రతినిధులు ఉన్నారు.