ముషీరాబాద్, ఫిబ్రవరి 8: ఎస్సీ వర్గీకరణ సాధన వరకూ మాదిగ విద్యార్థులు, యువత పోరుబాటను వీడొద్దని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాదిగ విద్యార్థులు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు వర్గీకరణ కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కోరారు. మాదిగలు, ఉపకులాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలని, వర్గీకరణ లక్ష్యసాధన చేరుకునే వరకు విశ్రమించ వద్దని కోరారు.