జమ్మికుంట రూరల్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మం డలంలోని వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఎన్నికయ్యారు. హన్మకొండలో ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ట్రస్ట్ బోర్డు ఇన్చార్జి చైర్మన్ కే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ట్రస్ట్ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు.
మాజీ చైర్మన్ పీ జనార్దన్రెడ్డి ఇటీవల మరణించగా ఆయన స్థానంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ట్రస్ట్ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.