హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం హోదా లో ఉన్న వ్యక్తి నోటి నుంచి ‘రక్తం ఏరులై పారిద్దాం’ లాంటి హింసాత్మక మాటలు రావడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని పే ర్కొన్నారు.
హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్రెడ్డి.. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని ధ్వజమెత్తారు.