హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ కలిసి ఉండాలని కోరుకుటామనే వైసీపీ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎప్పటికీ తెలంగాణగానే ఉంటుందని స్పష్టంచేశారు. తెలంగాణ, ఏపీ కలయిక ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని, ఎన్ని జెండాలు ఉన్నా, ఎవరి ఎజెండా ఎలా ఉన్నా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు.
తెలంగాణ, ఏపీ కలువాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వాఖ్యలు దురదృష్టకరమని, ఆయన మాటలు విషం చిమ్మేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇదే తరహాలో కుట్రలను కేసీఆర్ సమర్థంగా ఎదురొన్నారని, ఇప్పుడు కూడా తిప్పికొట్టి తెలంగాణను కాపాడుకుంటారని చెప్పారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవకాశం వస్తే ఏపీలో తెలంగాణ కలిపేందుకు ఓటేస్తామన్న వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ మాటలు అలవోకగా, ఆషామాషీగా మాట్లాడారని తాము భావించడం లేదని.. దీని వెనక బీజేపీ, ప్రధాని మోదీ ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోదీ సహా అవకాశం వచ్చినపుడల్లా చాలామంది విషం చిమ్ముతున్నారని విమర్శించారు. గతంలో పార్లమెంట్లో, బహిరంగ సభల్లోనూ ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని మాట్లాడి మోదీ తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను బయటపెట్టారని, ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచుగా ఏపీలోని వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారని, మోదీ దన్నుతోనే నాడు చంద్రబాబు, నేడు సజ్జల తెలంగాణపై విషం కక్కారని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. సజ్జల మాటల వెనుక మోదీ కుట్ర ఉన్నదని ఆరోపించారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నదని, 2018లో మహాకూటమి పేరుతో టీఆర్ఎస్ను ఓడించే ప్రయత్నం చేశారని అన్నారు. తాజాగా కేసీఆర్ను ఎదురొనేందుకు మోదీ ఎన్నో బాణాలను వదులుతున్నారని.. వైఎస్ షర్మిల, కేఏ పాల్లు కూడా మోదీ వదిలిన బాణాలేనని విరుచుకుపడ్డారు. ఇవేవి తెలంగాణ ప్రజల నుంచి టీఆర్ఎస్ను దూరం చేయలేవని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలు ఏవో, నీళ్లు ఏవో తెలుసని స్పష్టం చేశారు.
తెలంగాణ టాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియమాకాలను సీఎం కేసీఆర్ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. ఈ రోజు తెలంగాణ అన్నపూర్ణగా ఉన్నదని.. ఏ రంగంలో చూసినా తెలంగాణ పురోగతిలో ఏపీని దాటేసిందని స్పష్టంచేశారు. మొదటి విడత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రెండోవిడత ప్రభుత్వంలో ఇప్పటివరకు 90 వేల పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చామని వెల్లడించారు. ఇప్పటివరకు 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక పీఆర్సీ ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేనంతగా విద్యుత్తు ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. పచ్చపడిన తెలంగాణ పల్లెలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను చూసి కొందరి కళ్లు మండుతున్నాయని అన్నారు. కరెంటు వినియోగంలో తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదన్నారు. తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ఏపీలో ఆ పరిస్థితి లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు ఆవరిస్తాయన్న అప్పటి పాలకుల మాటలు తప్పని నిరూపించామన్నారు. ఇప్పుడు ఏపీలోనే కరెంటు కోతలు ఉన్నాయని, అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ధాన్యం, పత్తి పండుతున్నదని స్పష్టంచేశారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం తెలంగాణలో గణనీయంగా పెరిగిందని చెప్పారు.
తెలంగాణలో 24 గంటల కరెంటు వస్తున్నదో? లేదో? కరెంటు తీగలను టచ్ చేసి చూస్తే తెలుస్తుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు పల్లా చురకలంటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. బండికి ఏ విషయం మీద అవగాహన లేదని, తలా తోక లేకుండా మాట్లాడుతుంటారని విమర్శించారు. విద్యుత్తు సరఫరా బండి సంజయ్తో చర్చకు సిద్ధమని ఆయన ప్రతి సవాల్ విసిరారు.
వైఎస్ షర్మిల ఏం మాట్లాడాలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తోపాటు బీజేపీ పార్టీ నాయకులు శిక్షణ ఇస్తున్నారని పల్లా ఆరోపించారు. మోదీతో ఏం మాట్లాడాలో గవర్నర్ షర్మిలకు ట్రైనింగ్ ఇచ్చారని, అందుకే ఢిల్లీకి వచ్చి కలవాలని మోదీ ఆహ్వానించారని చెప్పారు. తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలన్నదే బీజేపీ ప్రయత్నమని అన్నారు. తెలంగాణలోని కొందరు బీజేపీ విసిరే బొకలకు ఆశ పడి మొరుగుతున్నారని దుయ్యబట్టారు. తాము ఎవరు రెచ్చగొట్టినా రెచ్చి పోమని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలోని 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్తు కొరత ఉన్నదని తెలిసీ సీలేరును ఏపీకి అప్పగించారని మండిపడ్డారు.
ఏపీలో ఉన్న సమస్యలను పక దారి పట్టించేందుకే వైసీపీ నేతలు సమైక్య మాటలు వల్లిస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అకడ ప్రజలకు అవసరమైన పనులు చేయడం చేతగాకే, బాగుపడ్డ తెలంగాణతో కలవాలని వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరవై ఏండ్లుగా తెలంగాణను దోచుకున్నది చాలదా? ఇంకా దోచుకోవాలని చూస్తున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. మోదీ ఆదేశాల మేరకే కొందరు మొరుగుతున్నారని తెలంగాణ ప్రజలకు అర్థమైందని అన్నారు. కాళోజీ స్ఫూర్తితో టీఆర్ఎస్ పని చేస్తున్నదని, ప్రాంతంవాడు ద్రోహం చేస్తే ఇకడ పాతరేస్తాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొడుతామని అన్నారు. ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదని స్పష్టంచేశారు.