హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఏకగ్రీవం కాకుంటే ఈ నెల 29న ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో గెలిచేవారు 30 నవంబర్ 2027 వరకు పదవిలో ఉంటారు.