హిమాయత్నగర్, డిసెంబర్ 25: పద్మశాలీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో అఖిల భారత పద్మశాలీ ఇంజినీర్స్ విభాగం డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు శ్రీధర్ ఎన్ సుంకుర్వార్, జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, నాయకులు మసున మోహన్ నారాయణ, నక్క వేణుమాధవ్, చంద్రమౌళి, వనం దుశ్యంతల, యర్రమాద వెంకన్న, జీ రూప, అవ్వారి భాస్కర్, కచర్ల రాజ్కుమార్, విఠల్, నరేందర్, శ్రావణ్, సునీత, శారద తదితరులు పాల్గొన్నారు.