మహబూబ్నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీఆర్ సభకు హాజరై.. తాను పార్టీ మారడం లేదని, అదంతా కట్టు కథ అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేత ఒకరు పిలిస్తే పలుకరించడానికి వెళ్లానే తప్ప పార్టీ మారడానికి కాదని తేల్చిచెప్పారు. దీంతో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి పార్టీ మారుతున్నారంటూ.. కొన్ని పత్రికల కథనం అబద్ధమని తేలిపోయింది.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్లకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ పలు పత్రికలు అసత్య కథనాన్ని ప్రచురించాయి. ఇటీవల దామోదర్రెడ్డి, కాంగ్రెస్ నేతలు స్నేహపూర్వకంగా కలవడాన్ని.. పార్టీ మారినట్టు చిత్రీకరించి కథనాలు ప్రచురించాయి. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ తీసుకొని ఎమ్మెల్సీ దామోదర్రెడ్డితో చర్చలు జరిపారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను ఢీకొనే శక్తి ఏ పార్టీకి లేదనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని పత్రికలు బీఆర్ఎస్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ఘటనతో స్పష్టమవుతున్నది.