హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి ఎం.వి. సౌందరరాజన్కు సంప్రదాయ సంరక్షణ దీప బిరుదు ప్రధానం చేశారు. శ్రీ గోపాలదేసికా మహదేసికన్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీరంగంకు చెందిన పౌండరీకాపురం శ్రీమద్ అండవన్ ఆశ్రమం డాక్టర్ సౌందరరాజన్కు ఈ బిరుదు ప్రధానం చేసింది. ప్రభుత్వ జోక్యం, రాజకీయ, వాణిజ్య అంశాలకు వ్యతిరేకంగా ఆలయ వ్యవస్థను సంరక్షించడం ద్వారా ధర్మ రక్షణలో ఆయన చేసిన నిరంతర సేవలకు ఈ బిరుదు ఓ గుర్తింపు అని నిర్వాహకులు తెలిపారు.
ఎంకామ్, ఎల్ఎల్బీ, కామర్స్లో డాక్టరేట్ పొందిన డాక్టర్. సౌందరరాజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1981లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. వంశపారంపర్య క్రమంలో ఆలయ ధర్మకర్తగా, అర్చకులు ఉన్నారు. అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. హుండి సంప్రదాయాన్ని తీసేశారు. వీఐపీ దర్శనం అనేది లేకుండా భక్తులందరికి ఒకే క్యూ లైన్లో దర్శనం, టికెట్ విధానం లేకుండా, ఆర్జిత సేవలు లేకుండా, నగదు సమర్పణలు లేకుండా ఇలా పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు.