సంగారెడ్డి : అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన పచాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆదివారం ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యే జీఎంఆర్ కు పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటినుంచి వైద్యులు విష్ణువర్దన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం ఉదయం 2: 30 నిమిషాలకు మృతి చెందాడు.