హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మంత్రి కే తారకరామారావుకు ఆయ న సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ప్రగతిభవన్లో జరిగిన రక్షాబంధన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మరో సోదరి (ఎంపీ సంతోష్కుమార్ సోదరి) సౌమ్య కూడా కేటీఆర్కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేటీఆర్, కవిత రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
కొన్ని బంధాలు ఎంతో ప్రత్యేకం!: కేటీఆర్
‘కొన్ని బంధాలు ఎంతో ప్రత్యేకమైనవి’ అనే క్యాప్షన్తో మంత్రి కేటీఆర్ రెండు ఫొటోలను ట్విట్టర్లో పంచుకొన్నారు. కేటీఆర్ తన కూతురు అలేఖ్య, కుమారుడు హిమాన్షు రాఖీ సందర్భంగా తీసుకొన్న చిన్ననాటి ఫొటో కాగా, కేటీఆర్, తన సోదరి కవితతో కలిసి కూర్చొన్న చిన్ననాటి దృశ్యం. ఈ ట్వీట్కు మంత్రి కేటీఆర్ ‘హ్యాపీరాఖీ..’, ‘హ్యాపీ రక్షాబంధన్’ అని హ్యాష్ట్యాగ్ను జత చేశారు.