జగిత్యాల : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రీ (ఎల్జీ రాం) (92) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత రమణను సోమవారం పరామర్శించారు. అంతకుముందు ఎల్ జి రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కవిత వెంట ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగరావు, తదితరులు ఉన్నారు.
కాగా, ఎల్జీ రాం జగిత్యాలలో రేడియో, సైకిల్ డీలర్, ఆ తర్వాత ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్జీ రాం హెల్త్కేర్ సొసైటీ కింద పేద ప్రజలకు వైద్య సేవలందించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్జీ రాం లాడ్జి నిర్మించి ప్రయాణికులకు సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా, మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే.