హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధి మాడల్ దేశానికి దిక్సూచి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అతి తకువ సమయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అత్యంత వేగంగా తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని చెప్పారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మంగళవారం ‘డెవలప్మెంట్ ఎకనామిక్స్’ అంశంపై జరిగిన సదస్సులో కవిత కీలకోపన్యాసం చేశారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.
ఈ సదస్సులో కవిత ‘తెలంగాణ మాడల్’పై మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిషరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ను ఆమె అభినవ చాణక్యునిగా, అహింసా మార్గంలో రాష్ర్టాన్ని సాధించిన గాంధీగా అభివర్ణించారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తిని ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందున్నదని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఒక మతకల్లోలం లేదని, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ మాడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని, మారిన జీవన స్థితిగతులకు నిదర్శనమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో 9 వెనుకబడి ఉండేవని చెప్పారు. 2014కు ముందు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉండేదని, ఇప్పుడు అటువంటివేమీ లేవని తెలిపారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ అద్వితీయ ప్రగతిని సాధించిందని తెలిపారు.
రికార్డు స్థాయిలో సాగునీటి విప్లవం
రికార్డుస్థాయిలో మూడున్నరేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్కు దకుతుందని కవిత వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు మూడు పంటలు పండిస్తున్నారని, పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22,36,000 ఉపాధి అవకాశాలను సృష్టించామని చెప్పారు. 2014లో రాష్ట్రం నుంచి రూ.57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అయితే ఇప్పుడు అవి రూ.1.83 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.