హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్ నేడు కోర్టు ముందుకు రానుంది. విచారణకు రానుంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో జస్టిస్ కావేరీ జడేజా ఈ పిటిషన్ను విచారించనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 26న కవిత మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, అందువల్ల ఏప్రిల్ 16 వరకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని కోరారు.
మద్యం పాలసీ కేసు విచారణలో ఉందని, ఈ సమయంలో కవితకు బెయిల్ మంజూరు చేయకూడదని ఈడీ కోరనుంది. కాగా, జైలులో వసతుల కల్పించడం లేదంటూ కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది.
మార్చి 15న ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అదేనెల 16న ఆమెను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కవితకు కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. తర్వాత మరో మూడు రోజులపాటు కస్టడీని పొడిగింది. మార్చి 26న కస్టడీ గడువు పూర్తవడంతో ఏప్రిల్ 9 వరకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.