హైదరాబాద్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, ప్రజలంతా బాగుండాలన్నారు. ఈ ఉగాది, తెలంగాణ యువతకు ఉద్యోగ నామ సంవత్సరం అవుతుందని అభిప్రాయపడ్డారు.