MLC Kavitha | కమాన్చౌరస్తా : ఏడు తరాలు( Seven Roots ) పుస్తకం చదివి ఏడ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పేర్కొన్నారు. ఇది గొప్ప పుస్తకమని, మనిషిలో సామాజిక స్పృహను పెంపొందింస్తుందని అభిప్రాయపడ్డారు.
సోమవారం ఆమె శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కరీంనగర్( Karimnagar )లోని జ్యోతిబాఫూలే మైదానం, శ్రీభాష్యం విజయసారథి ప్రాంగణంలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏడు తరాలు పుస్తకాన్ని మంత్రి గంగులకు చూపిస్తూ మీరు కూడా తప్పకుండా చదవాలని కోరారు.