హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దీపావళి వేడుకల్లో భాగంగా పటాకులు కాల్చే సమయంలో కంటికి గాయాలై సరోజినీదేవి కంటి దవాఖానలో చికిత్స పొం దుతున్న వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికంగా అండగా నిలిచారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల జీతం నుంచి బాధితుల చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని కేటాయించారు.
తెలంగాణ జాగృ తి నాయకులు ఈ సాయాన్ని దవాఖాన వైద్యులకు అందజేశారు. బాధితులకు తోడుగా దవాఖానకు వచ్చే కుటుంబసభ్యులకు 3 రోజులపాటు భోజన వసతి ఏర్పాటుచేశారు. పటాకులు కాల్చుతూ కంటికి గాయాలైనవారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్సీ కవిత దవాఖాన వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మైరుగైన వైద్యం అందించాలని కోరారు.