హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Gehlot) , ఎంపీలు జయంత్ చౌదరీ, సంజయ్ సింగ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీప్ టిర్కే హాజరవుతారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai chanu), రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat zareen) నామినేట్ అయ్యారు.