హైదరాబాద్ : దంగల్ అంటే దమ్మున్న క్రీడ అని, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్బీ స్టేడియంలో 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంఫియన్షిప్ ముగింపు కార్యక్రమం జరిగింది. 85 కేజీల మహిళల రెజ్లింగ్ టైటిల్ మ్యాచ్ను కవిత వీక్షించారు. అనంతరం విజేత, రన్నరప్గా నిలిచిన క్రీడాకారులను ఆమె అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెజ్లింగ్ ఎంతో ప్రాచీనమైన క్రీడ అని, ఇప్పటి వరకు ఒలింపిక్స్లో రెజ్లింగ్లో ఎక్కువ పతకాలు వచ్చాయన్నారు. విజయ్కుమార్ యాదవ్ గౌరవార్థం జరుగుతున్న పోటీలకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. రెజ్లింగ్ అంటే బలమే కాదని.. తెలివి, టెక్నిక్, స్పీడ్ను ప్రదర్శించే క్రీడ అన్నారు. కుస్తీ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.