MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. నిజామాబాద్ యువత వాణి వినాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను `ఎక్స్` లో కల్వకుంట్ల కవిత పోస్ట్ చేశారు.
`మీ క్షమాపణ కోసం అమరవీరుల కుటుంబాలు ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఎంతోమంది యువత అమరవీరులు కావడానికి కారణం గాంధీ కుటుంబమే. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తు చేసేందుకు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు` అని కవిత పేర్కొన్నారు. `ఆత్మ బలిదానాలన్నీ కాంగ్రెస్ హత్యలే` అని అంటున్న నిజామాబాద్ విద్యార్థులు, యువత అంటున్న మాటలను వినాలని రాహుల్ గాంధీకి సూచించారు.