నమస్తే తెలంగాణ నెట్వర్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు.. మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగే జన్మదిన వేడుకల వివరాలను బుధవారం పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. నెక్లెస్రోడ్ సంజీవయ్య పార్ పకన ఉన్న థ్రిల్ సిటీలో కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై జబర్దస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీ కేక్ కటింగ్ అనంతరం ఐదుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ఆయుష్షు హోమం, బలంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, రాజశ్యామల యాగం, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్లో చండీయాగం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో అభిషేకం నిర్వహిస్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సీఎం గోత్రనామాలతో అర్చన, ఓల్డ్సిటీ లాల్దర్వాజ సింహవాహిని ఆలయంలో లక్ష పుష్పార్చన చేస్తారు. సికింద్రాబాద్ క్లాక్టవర్, అబిడ్స్ వెస్లీ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతోపాటు నాంపల్లి దర్గా, నల్లగుట్ట మసీదుల్లో చాదర్ను సమర్పించనున్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ధూప,దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ, గ్రేటర్ అధ్యక్షుడు శ్రీరంగం గోపీకృష్ణమాచార్యులు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ధార్మిక భావన కలిగిన గొప్ప ఆధ్యాత్మికవేత్త సీఎం కేసీఆర్ అని, అన్నిరంగాల్లో అపార అనుభవాన్ని వినియోగిస్తూ రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందడి రెండురోజుల ముందే మొదలైంది. 17న కేక్ కటింగ్లతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ఆధ్వర్యంలో ఇప్పటికే ఖైరతాబాద్, బేగంపేట, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్లు, రహదారులు గులాబీమయమయ్యాయి.
సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పురుషుల, మహిళల స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా గురువారం బోయిన్పల్లి కంటోన్మెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కేసీఆర్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాయి. అలాగే యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి స్టేడియం ప్రాం గణంలో తెలుగు టీవీ ఫెడరేషన్ కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యలో 3 రోజులపాటు వరంగల్ ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో జరిగే వేడుకలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. సచివాలయం తరహాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్, తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎగ్జిబిషన్ రూపంలో ఎమ్మెల్యే నరేందర్ ఏర్పాటు చేసిన ఫొటోలను మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ దయాకర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి తదితరులు వీక్షించారు.
సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తెలంగాణ సాయి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. బీఆర్ఎస్ జాతీయ ఆఫీస్ ఢిల్లీతోపాటు వసంత్ విహార్లోని పార్టీ నూతన కార్యాలయం ప్రాంగణంలోనూ ఫ్లెక్సీలు ఆకట్టుకొంటున్నాయి.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పక్కన పురాతన రామాలయంలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్నట్టు శాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.
అన్ని కుల, వర్గాలను సమానంగా చూసే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. హైదరాబాద్లోని బేగంపేట్ సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్న వెస్లీ కళాశాల మైదానంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో బుధవారం దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్చేసి, ముఖ్యమంత్రికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు,సీఎస్ఐ సినార్డ్ మోడరేటర్ ధర్మరాజు, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన బిషప్లతో పాటు గజ్జెల నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ నాయకులు పార్టీ అధినేతకు విషెస్ చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సాయి జార్ఘండ్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్