హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా సంబంధిత సహాయ, సూచనలకు ఎవరైనా ఫోన్ నెంబర్లు 040-23599999 / 8985699999 (హైదరాబాద్), 08462- 250666 (నిజామాబాద్ కార్యాలయం)లో సంప్రదించవచ్చని సూచించారు. తన బృందం 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుందని కవిత పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి