హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగా): ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన.. ఒక్కో ఉ మ్మడి జిల్లాను ఒక జోన్గా రూ పొందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి కోరారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పున:సమీక్షించాలని విజ్ఞప్తి చేశా రు. శుక్రవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చను జీవన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 317 జీవో వల్ల ఉద్యోగులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిని సరిదిద్దడానికి దానిని పునఃసమీక్షించాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయాలని, కేంద్రం వివక్ష వల్ల ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయామని చెప్పారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. కృష్ణా జలాలను కా పాడుకోవడంలో ఉదాసీనత తగదన్నారు.