హైదరాబాద్ : ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 96.69 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 87.73 శాతం పోలింగ్, నల్లగొండ జిల్లాలో 83.63 శాతం పోలింగ్, ఖమ్మం జిల్లాలో 79.95 శాతం, కరీంనగర్ జిల్లాలో 72.08 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.