హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను సోమవారం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. ఎమ్మెల్సీలు గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ కుమార్ పదవీ కాలం ఈ నెల 29న ముగియనున్నది. దీంతో ఖాళీ అవుతున్న ఈ మూడు స్థానాలకు ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ప్రతిపక్షాలకు నామినేషన్లు వేయడానికి అవసరమైన సభ్యులు లేరు. దీంతో ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.