మెదక్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఏడు పాయలలోని వనదుర్గా ఆలయంలో నూతన రథం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అమ్మవారి మీద అచంచలమైన భక్తితో ఉడతా సాయంగా తన వంతుగా, ఎమ్మెల్సీ వేతనం నుండి రూ.5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత వినమ్రంగా పేర్కొన్నారు. ఈ చెక్కును ఎమ్మెల్సీ కవిత ఆలయ కమిటీకి అందజేశారు. గతంలో మొక్కు చెల్లించుకునే నిమిత్తమై కవిత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి వనదుర్గా మాతను దర్శించుకున్న విషయం తెలిసిందే.