హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి బొగ్గు టెండర్ల స్కామ్ జరిగిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి, తన బామ్మర్ది సంతోషం కోసం, తన అనుయాయులకు మేలు జరిగేలా భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. సింగరేణి టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార చేస్తున్న సమర్థనలు చూస్తుంటే, ఇందులో భారీ సామ్ జరిగినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేశామంటున్న భట్టి.. అసలు ఏ కారణంతో రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమారపై పత్రికల్లో వస్తున్న కథనాల వెనుక సీఎం రేవంత్రెడ్డే ఉన్నారని ఆరోపించారు. ‘భట్టిపై వార్తలు రాయించిన వ్యక్తి ఎవరు? ఇంకెవరు? ఆ కథ, స్రీన్ప్లే మొత్తం రేవంత్రెడ్డిదే. తన సొంత క్యాబినెట్ మంత్రిపై లీకులు ఇప్పిస్తున్న సీఎం తీరును భట్టి ఎందుకు ప్రశ్నించడం లేదు? డిప్యూటీ సీఎం భట్టి ఎవరికి భయపడుతున్నారు?’ అని నిలదీశారు.
ఆధారాలు బయట పెట్టారనే వేధింపులు
బొగ్గు కుంభకోణాన్ని ఆధారాలు సహా హరీశ్రావు బయటపెట్టగానే, ప్రభుత్వం తట్టుకోలేక సిట్ నోటీసులతో కేటీఆర్, హరీశ్రావును ఇబ్బందులు, వేధింపులకు గురిచేస్తున్నదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఒకే కేసుపై రెండు సిట్లు ఏర్పాటుచేయడం హాస్యాస్పదమని, ప్రభుత్వాన్ని నడుపుతున్నది పోలీసులా? ప్రజాప్రతినిధులా? అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి తన 40 ఏండ్ల రాజకీయ జీవితం గురించి మాట్లాడుతున్నారు.. కానీ, 50 ఏండ్ల అనుభవం ఉన్న కేసీఆర్ని సీఎం రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు తిడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎదుటివారిని గౌరవించినప్పుడే మనకు గౌరవం దకుతుందని హితవు పలికారు. ‘తెలంగాణ రైజింగ్-పాలన ఫాలింగ్’ అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. గత రెండేండ్లలో ఒక విధానపరమైన పాలసీ రాలేదని, కేవలం ‘దోపిడీ పాలసీ’ మాత్రమే నడుస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి రియల్ఎస్టేట్ మైండ్సెట్తో పరిపాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులను కూడా రియల్ఎస్టేట్ ఆఫీసులుగా మారుస్తారేమోనన్న అనుమానం వ్యక్తంచేశారు. టీ-హబ్ను రిజిస్ట్రేషన్ ఆఫీసుగా మార్చాలని చూడటమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.