హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఎఫ్ఎస్లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికమా? సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేందుకు వేసిన పక్కా స్కెచ్చా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ శనివారం అనుమానం వ్యక్తంచేశారు. ఈ అగ్నిప్రమాదం ముమ్మాటికి సాక్ష్యాలను తుడిచిపెట్టే కుట్ర అని.. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు వంటి కీలకమైన ఫైల్స్ ఉన్న ఈ సెక్షన్లోనే షార్ట్సర్క్యూట్ జరగడం యాదృచ్ఛికం అంటే నమ్మేలా లేదన్నారు.
కంప్యూటర్లు కాలిపోయాయా? లేక కుంభకోణం సాక్ష్యాలను కాల్చి బూడిద చేశారా? అని ప్రశ్నించారు. డాటా బ్యాకప్ లేకుండా, సాక్ష్యాలు తగులబడ్డాయనడం మోసం చేయడమేనని విమర్శించారు.